Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ద్వంద్వ పౌరసత్వం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
posted on: Apr 18, 2026 8:25PM

ద్వంద్వ పౌరసత్వం వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం మౌఖికంగా ఆదేశించింది.
అయితే, ఈ తీర్పు కాపీపై సంతకం చేసే ముందే కోర్టు తన నిర్ణయాన్ని సమీక్షించుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాదన వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. 2014 నాటి ఒక ఫుల్ బెంచ్ తీర్పును ఉటంకిస్తూ, నిందితుడికి నోటీసులు ఇచ్చి వివరణ కోరడం తప్పనిసరని కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విగ్నేష్ శిశిర్ ఈ పిటిషన్ వేశారు.
2003-2009 మధ్య లండన్లోని 'బ్యాక్ ఆప్స్ లిమిటెడ్' అనే కంపెనీకి డైరెక్టర్గా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటీష్ పౌరుడిగా పేర్కొన్నారని, ఇది భారత రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధమని ఆయన వాదన. గతంలో లక్నోలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేయడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. అప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియపై స్టే కొనసాగుతుంది.


.webp)
.webp)


