పద్మ అవార్డు గ్రహీతలు వీరే

posted on: Jan 25, 2012 3:17PM

ఢిల్లీ : ఏటా ఇచ్చే పద్మ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 109 మందికి అవార్డులు లభించాయి. వారిలో ఐదుగురికి పద్మవిభూషణ్‌, 27 మందికి పద్మభూషణ్‌, 77 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. అవార్డు విజేతల్లో 19 మంది మహిళలు ఉన్నారు. మన రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్‌ క్రీడాకరుడు సయ్యద్‌ మహ్మద్‌ అరీఫ్‌, సామాజిక సేవ విభాగంలో తిరుపతికి చెందిన జి. మునిరత్నంనాయుడులకు పద్మశ్రీ అవార్డు లభించింది.
 
పద్మవిభూషణ్‌...
సంగీతకారుడు భూపేన్‌ హజారికా, కార్టునిస్ట్‌ మారియో డి మిరాండాలకు మరణానంతరం పద్మవిభూషణ్‌ లభించింది. మాజీ గవర్నర్‌ టీవీ రాజేశ్వర్‌, డాక్టర్‌ కాంతిలాల్‌ హస్తిమల్‌, కే.జీ. సుబ్రహ్మణ్యం(చిత్రకారుడు) తదితరులకు పద్మవిభూషణ్‌ అవార్డులు వచ్చాయి.
 
పద్మభూషణ్‌...
సినీనటుడు ధర్మేంద్ర, నటి షబానా ఆజ్మీ, దర్శకురాలు మీరానాయర్‌, కార్డియాలజిస్టు దేవీ ప్రసాద్‌ శెట్టి, మాజీ సీవీసీ ఎస్‌.విఠల్‌, రొనెన్‌ సేన్‌(సివిల్‌ సర్వీస్‌), చిత్రకారుడు జతిన్‌ దాన్‌, వయోలిన్‌ వాద్యకారుడు ఎమ్మెస్‌ గోపాలకృష్ణన్‌, సరోద్‌ వాద్యకారుడు పండిట్‌ బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా తదితరులకు అవార్డులు వచ్చాయి.
 
పద్మశ్రీ...
హాకీ క్రీడాకారుడు జాఫర్‌ ఇక్బాల్‌, మహిళా క్రికెటర్‌ ఝూలన్‌గోస్వామి, అర్చర్‌ లింబారామ్‌, భజన్‌ గాయకుడు అనూవ్‌ జలోట, పారిశ్రామికవేత్త పిరామల్‌, ఉల్లాస్‌ కారంత్‌ తదితరులకు ఈ అవార్డులు వచ్చాయి.
 
బాపుకు దక్కని అవార్డు...
ప్రముఖ సినీ దర్శకుడు బాపుకు ఈ ఏడాది కూడా పద్మ అవార్డు దక్కలేదు. జాతీయ స్థాయిలో అనామకులకు అవార్డులు ఇచ్చి ఎన్నో దృశ్యకావ్యాలు నిర్మించి తెలుగు చలన చిత్ర రంగ విశిష్టతను ప్రపంచానికి చాటిన బాపును పట్టించుకోలేదని సినీ రంగ ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బాపును టాలీవుడ్‌, కేంద్రసర్కారు నిర్లక్ష్యం చేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...