Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ
posted on: May 11, 2026 9:06AM
.webp)
నరాలు తెగే ఉత్కంఠ అని తరచూ వింటూ ఉంటాం. కానీ ఆదివారం (మే 10) ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అది అనుభవంలోకి వచ్చింది. ఐపీఎల్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. చివరి బంతికి అవసరమైన రెండు పరుగులు తీసి ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ నే కాకుండా లక్నో సూపర్ జయంట్స్ జట్టును కూడా ప్లే ఆప్ రేస్ నుంచి ఔట్ అయిపోయేలా చేసింది. అదే సమయంలో ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా 73 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్, భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన హైలైట్ గా నిలిచాయి.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ (కేవలం 23 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. తన పదునైన బౌలింగ్తో రికిల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను ఔట్ చేశాడు. . అయితే, తిలక్ వర్మ హాఫ్ సెంచరీ, నమన్ ధీర్ 47 పరుగులతో రాణించడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఇక 167 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ కూడా ఇబ్బందులు పడింది. ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. పవర్ప్లే ముగిసేసరికి కెప్టెన్ రజత్ పటిదార్తో సహా మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 47 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా, కండరాల గాయంతో ఇబ్బందులు పడుతున్నా.. పట్టుదలగా ఆడి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు.
అయితే.. ముంబై బౌలర్ కార్బిన్ బాష్ 26 పరుగులకు 4 వికెట్లతో అద్భుత బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. బుమ్రా కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేటలో ఆర్సీబీ తడబడింది. చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు అవసరమైన సమయంలో అద్భుతమే జరిగింది. రాజ్ బావా వేసిన ఈ ఓవర్ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఒక వైడ్, ఒక నోబాల్ తరువాత రొమారియో షెపర్డ్ను ఔట్ చేశాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన సిక్సర్ బాది ఆ తరువాతి బంతికి సింగిల్ తీయడంతో.. ఆర్సాబీ ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి బంతిని ఎదుర్కొన్న రసిఖ్ సలామ్ దార్ రెండు పరుగులు పూర్తి చేసి ఆర్సీబీకి చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు. అద్భుత బౌలింగ్, అత్యంత కీలకమైన దశలో సిక్సర్ బాది మ్యాచ్ ను గెలిపించిన భువనేశ్వర్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.


.webp)



