Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్ల పతనం: ₹15.15 లక్షల కోట్ల భారీ కుంభకోణమా? సెబి సంచలన ఆరోపణలు!
posted on: Jun 6, 2026 10:44AM
.webp)
భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు నమ్మకమే పెట్టుబడి. కానీ, ఒక చిన్న అవకతవక లేదా కార్పొరేట్ గవర్నెన్స్ లోపం వందల కోట్ల సంపదను క్షణాల్లో ఆవిరి చేస్తుంది. ప్రస్తుతం దలాల్ స్ట్రీట్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్షే ర్ల తీవ్ర పతనం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తోంది. ఈ వారంలోనే ఈ స్మాల్-క్యాప్ స్టాక్ ఏకంగా 16 శాతం పైగా క్షీణించి, వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో లోయర్ సర్క్యూట్లను తాకింది. దీనికి ప్రధాన కారణం, దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఈ సంస్థపై మోపిన తీవ్రమైన ఆరోపణలే. ఈ ఆకస్మిక విక్రయాలు మరియు మార్కెట్ స్పందన చూస్తుంటే, గతేడాది ఇన్వెస్టర్ల కొంపముంచిన జెన్సాల్ ఇంజనీరింగ్ సంక్షోభం మళ్లీ కళ్లముందు కదలాడుతోంది.
ఈ వివాదానికి కేంద్ర బిందువు సెబి జారీ చేసిన 109 పేజీల తాత్కాలిక ఆదేశం (Interim Order). ఈ నివేదికలో సెబి సంచలన విషయాలను బయటపెట్టింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ గత ఐదేళ్ల కాలంలో (ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుండి 2025 వరకు) తన మొత్తం ఆదాయాన్ని దాదాపుగా తప్పుగా చూపించిందని ప్రాథమిక విచారణలో తేలింది. సంస్థ పేర్కొన్న అనుబంధ సంస్థల (Subsidiary) రాబడిలో దాదాపు 99.8 శాతం అంటే, అక్షరాలా రూ. 15.15 ట్రిలియన్ల (రూ. 15.15 లక్షల కోట్లు) మేర తప్పుడు లెక్కలు చూపించారని సెబి ఆరోపించింది. ఈ భారీ అంకెలు మార్కెట్ నిపుణులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అయితే, రాజేష్ ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. జూన్ 3 నాటి సెబి ఆదేశాల అనంతరం స్పందించిన కంపెనీ, తమ వైపు ఎలాంటి తప్పు జరగలేదని, స్విస్ అనుబంధ సంస్థ అయిన వాల్కాంబీ రాబడిని లెక్కించడంలో సెబికి గందరగోళం ఏర్పడిందని తెలిపింది. సెబి వాల్కాంబీ ఆదాయానికి బదులుగా ఎబిటా (EBITDA)ను పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈ వ్యత్యాసం వచ్చిందని, తాము ప్రకటించిన ఏకీకృత ఆదాయం (Consolidated Revenue) పూర్తిగా సరైనదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు సెబి ఎలాంటి తుది జరిమానా గానీ, కఠిన చర్యలు గానీ తీసుకోలేదని గుర్తు చేసింది.
మార్కెట్ వర్గాల్లో ఈ వివాదాన్ని జెన్సాల్ ఇంజనీరింగ్తో పోల్చడానికి ఒక బలమైన నేపథ్యం ఉంది. 2025లో జెన్సాల్ ఇంజనీరింగ్ ప్రమోటర్ సోదరులైన అన్మోల్ సింగ్ జగ్గీ మరియు పునీత్ సింగ్ జగ్గీలు కంపెనీ నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని సెబి గుర్తించింది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలు కోసం కేటాయించిన రూ. 260 కోట్లకు పైగా నిధులను మళ్లించి, విలాసవంతమైన జీవితానికి వాడుకున్నారనే ఆరోపణల వల్ల జెన్సాల్ షేర్లు దాదాపు 80 నుండి 90 శాతం వరకు విలువను కోల్పోయి రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా కేవలం ఆదాయాల తప్పుడు నివేదికే కాకుండా, దాదాపు రూ. 339 కోట్ల నిధులను బోర్డు ఆమోదం లేదా ఎలాంటి ముందస్తు వెల్లడి లేకుండానే ప్రమోటర్ ఖాతాల్లోకి మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే, కంపెనీతో వ్యాపార లావాదేవీలు జరిపినట్లు రికార్డుల్లో ఉన్న అఫ్లుయెన్స్ అనే సంస్థ, తమకు రాజేష్ ఎక్స్పోర్ట్స్తో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పడం ఈ కేసులో మరో పెద్ద రెడ్ ఫ్లాగ్గా మారింది.



.webp)


