ఎల్ నినో ఎఫెక్ట్.. 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!

posted on: Jun 6, 2026 10:41AM

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనాధారమైన వ్యవసాయ రంగానికి వెన్నుముక లాంటి నైరుతి రుతుపవనాలు ఈ సారి దెబ్బకొట్టనున్నాయి. ఎల్ నినో ప్రభావంతో దేశంలో ఈ ఏడాది 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎమ్డి పేర్కొంది.  పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న  ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ  చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది.  ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో   90 శాతం కంటే తక్కువ   నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంటే సాధారణం కంటే చాలా తక్కువగా వర్షాలు కురుస్తాయి.  దశాబ్ద కాలంలోనే దేశంలోనే అత్యంత బలహీనమైన వర్ష సూచన ఇదే అవుతుందన్న మాట. 

సాధారణంగా జూన్ మొదటి తేదీకే దేశాన్ని పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ సారి , ఈసారి జూన్ 4న అంటే నాలుగు రోజులు ఆలస్యంగా   కేరళ తీరాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తూ..  దేశ ఆహార భద్రతను శాసించే రైరుతి  రుతుపవన వ్యవస్థ  ప్రారంభంలోనే ఇలా బలహీనపడింది.  

పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటాము.  ఎల్ నినో   వాతావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. రుతుపవనాల విస్తరణకు అత్యంత కీలకం సముద్రంలో తుపానులు ఏర్పడడానికి అనువైన వాతావరణం ఏర్పడటం. అయితే ఎల్ నినో ప్రభావంతో తుపానులు ఏర్పడడానికి అనుకూలంగా వాతావరణం ఉండటం అటుంచి యాంటీ తుపాన్ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.  ఈ కారణంగా భారత ఉపఖండం వైపు వచ్చే రుతుపవన గాలుల వేగం, తీవ్రత పూర్తిగా తగ్గిపోతాయి. ఈ జూన్ నుండి ఆగస్టు 2026 మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడే అవకాశం 80 శాతం వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా..  నవంబర్ నాటికి ఈ ముప్పు ఏకంగా 90 శాతానికి పెరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ  పేర్కొంది. 

ఐఎండీ  అంచనాల ప్రకారం..  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కేవలం వాయవ్య ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశంఉంది. ముఖ్యంగా జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో  వర్షాలు కురిసే అవకాశం అత్యల్పం అని ఐఎండీ పేర్కొంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...