Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో రైల్వే ట్రాక్ ధ్వంసం
posted on: Sep 1, 2024 10:39PM
భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామం సమీపంలో చెరువు కట్ట తెగడంతో ఇంటెకన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దాంతో విజయవాడ - కాజీపేట మార్గంలో పలు రైళ్ళు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ ఎగువ, దిగువ మార్గాల్లో కంకర కొట్టుకునిపోయింది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.






