Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్, కేజ్రీవాల్, ఏచూరిల మీద దేశద్రోహం కేసు!
posted on: Feb 29, 2016 9:36AM

జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడి విద్యార్థులకు మద్దతు పలికిన రాజకీయ నాయకుల మీద తెలంగాణలో దశద్రోహం కేసు నమోదైంది. జేఎన్యూకి సంబంధించిన కన్నయా కుమార్ దేశద్రోహం కేసు కింద విచారణను ఎదుర్కొంటుండగా, ఆయనకి మద్దతు పలకడం కూడా దేశద్రోహం కిందకే వస్తుందన్నది ఫిర్యాదుదారుని వాదన. హైదరాబాదుకి చెందిన జనార్ధన్ గౌడ్ అనే న్యాయవాది, సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఈ కేసుని ధాఖలు చేశారు. ఈ సందర్భంగా రూపొందించిన ఎఫ్.ఐ.ఆర్లో రాహు్ల్గాంధితో పాటు జేఎన్యూకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఆనంద్శర్మ, అజయ్మాకెన్లని కూడా చేర్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చేరనున్న ఈ కేసులో న్యాయస్థానం ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి!


.jpg)



