ఏం జరుగుతోందో నాకు తెలియాలి- రాహుల్‌

posted on: Feb 4, 2016 3:50PM

దేశంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఏర్పడినా ఇప్పడు రాహుల్‌ తక్షణమే స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన గొడవలో విద్యార్థులను పరామర్శించేందుకు ఒకటికి రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. ఒక సున్నితమైన అంశాన్ని రాహుల్‌ రాజకీయం చేస్తున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించినా ఆయన పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక గొడవ గురించి తక్షణమే తనకు నివేదికను అందించాలని రాహుల్‌ అక్కడి ముఖ్యమంత్రిని ఆదేశించారట. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయట. ఈ ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక సంఘటనలో నలుగురు టాంజానియా దేశ విద్యార్థుల మీద స్థానికులు దాడి చేశారు. వారిలో ఒక యువతిని వివస్త్రగా ఊరేగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకపక్క పోలీసులు కానీ రాష్ట్రప్రభుత్వం కానీ యువతి విషయంలో ఎలాంటి పొరపాటూ జరగలేదని చెబుతుండగా… బెంగళూరులోని ఆఫ్రికన్‌ విద్యార్థి సంఘాలు మాత్రం పోలీసులు కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుని హోదాలో రాహుల్ గాంధీ తన కోసం ఒక నివేదికను ఆశిస్తున్నారు. అసలే సున్నితంగా ఉన్న ఈ అంశం కాస్తా రాహుల్ గాంధీ జోక్యంతో మరింత వివాదాస్పదం అయ్యేట్లు ఉంది. ఈసారి మరి రాహుల్ మనసులో ఏముందో!

google-ad-img
    Related Sigment News
    • Loading...