మా మమ్మీ అయితే అలాగా చేయదు: రాహుల్ గాంధీ

posted on: Aug 7, 2015 5:14PM

 

లలిత్ మోడీ వ్యవహారంలో లోక్ సభలో నిన్న సంజాయిషీ ఇచ్చుకొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభలో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, నేను లలిత్ మోడీకి ఎటువంటి ఆర్ధిక లబ్ది చేకూర్చలేదు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతని భార్య పోర్చుగల్లో ఒక ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను కేవలం మానవతా దృక్పధంతో లలిత్ మోడీకి బ్రిటన్ చట్టాలు అనుమతిస్తే వీసా మంజూరు చేయమని సూచించానే తప్ప అతనికి వీసా కోసం బ్రిటన్ ప్రభుత్వంపై నేను ఎటువంటి ఒత్తిడి చేయలేదు. భయంకరమయిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న లలిత్ మోడీ భార్యకు నేను సహాయపడాలనుకొన్నానే తప్ప లలిత్ మోడీకి కాదు. అతని భార్య ఎటువంటి నేరమూ చేయలేదు. ఆమెపై ఎటువంటి కేసులు లేవు. ఆమె కూడా ఒక సాధారణ భారతీయులు. అందుకే నేను మానవతా దృక్పదంతో ఆమె భర్త లలిత్ మోడీకి వీసా ఇవ్వగలిగితే ఇవ్వమని బ్రిటన్ ప్రభుత్వానికి సూచించాను. మానవత్వంతో నేను చేసిన ఈ పని తప్పనుకొంటే నేను ఎటువంటి శిక్షనయినా అనుభవించడానికి సిద్దం. ఒకవేళ నా స్థానంలో సోనియా గాంధీ ఉన్నా అలాగే చేసేవారు కాదా? అని ఆమె ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమె తన తల్లి గురించి మాట్లాడతానని తప్పు పట్టారు. తన తల్లి ఎన్నడూ అటువంటి తప్పు చేయదని అన్నారు. సుష్మా స్వరాజ్ ఈ విషయంలో లబ్ది పొందారని ఆయన ఆరోపించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...