Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం
posted on: May 3, 2026 2:41PM

కృష్ణ శిలతో ఆకివీడులో భవ్య రామమందిరం శంకుస్థాపన చేసిన రఘురామ...
రామాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించం..
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆలయ నిర్మాణం ఆగదు..
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు ఆదివారం ఉదయం ఈ పుణ్యకార్యానికి వైభవంగా శంకుస్థాపన చేశారు. స్థానిక భక్తులు, నేతల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు పునాది వేశారు.
ఆలయ పునర్నిర్మాణం కోసం వేద పండితులు సూచించిన శుభ ముహూర్తం ప్రకారం మే 3వ తేదీ ఉదయం 7:14 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎదురవుతున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పండితులు ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే శంకుస్థాపన జరగడం శుభపరిణామమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఇప్పటికే కొందరు కోర్టులను ఆశ్రయించారని, మరికొందరు కేసులు వేస్తామని బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్ని న్యాయపరమైన అడ్డంకులు సృష్టించినా, రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఆలయ నిర్మాణం ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ఈ ఆలయాన్ని కృష్ణ శిలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాబోయే 80 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా పక్కా ప్రణాళికతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. భక్తిభావంతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు మెండుగా ఉందని ఆయన గుర్తుచేశారు.
గత కొంతకాలంగా ఆకివీడులో ఈ ఆలయ పునర్నిర్మాణంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆలయ పురాతన స్థితి దృష్ట్యా దానిని ఆధునీకరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ చొరవ తీసుకోవడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
వచ్చే కొద్ది నెలల్లోనే నిర్మాణ పనులను వేగవంతం చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.



.webp)


