అల్లుడి పనైపోయిందా?
posted on: Nov 10, 2014 11:38AM

అత్త సొమ్ము అల్లుడికి దానమిచ్చినట్టు రాబర్ట్ వాద్రాకు అప్పనంగా భూములు కట్టబెట్టారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయ్యగారు సోనియా అల్లుడు కాబట్టి తెర వెనక ఇదంతా జరిగే ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ కథ ఇలా ఉంచితే అప్పట్లో అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండగా... హర్యానా, రాజస్థాన్ లో సారు మొత్తం 6 కంపెనీలు పెట్టారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోల్పోగానే ఆ 6 కంపెనీల్లో 4 దివాళా తీశాయి. అదేంటి హస్తం పవర్ కోల్పోతే అల్లుడు దివాళా తీయడమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ 4 కంపెనీల్లో చాలా రోజులుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేదట. పోనీ ఏమైనా చేద్దామంటే వాద్రా వల్ల కావడం లేదు. ఈ పరిస్థితుల్లో మారు మాట్లాడకుండా 4 కంపెనీలను మూసివేసి ఉద్యోగులను నట్టేట ముంచారు. ఇక ప్రస్తుతానికి ఉన్న కంపెనీలు రెండే. అవి ఉంటాయో ఊడుతాయో క్లారిటీ లేదు. దీనికి తోడు హర్యానా, రాజస్థాన్ లతో రెండు చోట్ల ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. దీంతో వాద్రాకు భయం పట్టుకుందట. అటు బీజేపీ నేతలు కూడా వాద్రాను షాడోలా వెంటాడుతున్నారట. అయ్యగారి అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకున్నారట. ఇప్పటికే సారు గురించి రహస్యాలను వెలికి తీసే పనిలో ఉన్నారట కొంతమంది బీజేపీ లీడర్లు. పక్కా ఆధారాలు కూడా దొరికాయట. కేవలం టైమ్ కోసమే చూస్తున్నారట. ఒక్కసారి ముహూర్తం కుదిరితే చాలు వాద్రాకు కంటిమీద కునుకు కూడా కష్టమేనంటున్నారు పరిశీలకులు. అదే జరిగితే సోనియా ఫ్యామిలీ ఎలా స్పందిస్తో? అయినా ఆమె కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎలాగూ పవర్ లో లేరు. మా అల్లుడు వెరీగుడ్ అని చెప్పుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నించినా వాద్రాను కాపాడుకోవడం కష్టమేనంటున్నారు పరిశీలకులు. ఈ దెబ్బతో చివరకు రాజస్థాన్, హర్యానాల్లోని కాంగ్రెస్ పెద్దలు కొంతమంది సోనియాగాంధీ ఫ్యామిలీతో డిస్టన్స్ మెయింటెయిన్ చేస్తున్నారట. ఎందుకంటే వాద్రా ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి తమకు ఎక్కడ బ్యాడ్ టైమ్ తెస్తుందోనని వాళ్ల భయం. అంతే లే మరి ఎవరి భయం వారిది. పాలిటిక్స్ లో ఉండాలంటే ముందు క్లీన్ ఇమేజ్ కూడా ముఖ్యమే కదా..






.webp)



