ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం

posted on: May 15, 2026 10:35AM

ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెడుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఉలవలపాడు సమీపంలో ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై ప్రయాణీకులును కిందికి దించేశాడు.

ఆ తరువాత క్షణాల్లోనే బస్సంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటన శుక్రవారం ( మే 15) తెల్లవారు జామున జరిగింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...