Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజకీయ వ్యూహకర్తల నక్క జిత్తులు..రూ.500 కోట్లు ఇస్తే గెలుపు గ్యారెంటీనా..?
posted on: Jul 5, 2026 3:15PM
.webp)
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య ఉండే ప్రత్యక్ష సంబంధాల ఆధారంగా నడిచిన రాజకీయాలు, నేడు ల్యాప్టాప్లు, పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా అల్గారిథమ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా రూ.100 కోట్ల నుండి రూ.500 కోట్ల వరకు భారీ ప్యాకేజీలు తీసుకుంటూ, వ్యూహాల పేరుతో రాజకీయాలను ఈ కార్పొరేట్ శక్తులు ఎలా శాసిస్తున్నాయనేది ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తోంది.
రాజకీయ వ్యూహాలు – తెరవెనుక అసలు కథగతంలో ఇందిరా గాంధీ 'గరీబీ హటావో' నినాదంతోనో, లేదా అంతకుముందు కమ్యూనిస్టులు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా 'కాడెద్దులు-ఎకరం నేల' అనే నినాదంతోనో ప్రజల నాడిని పట్టుకుని రాజకీయాలు చేశారు. నాడు నాయకులకు ప్రజల అవసరాలు, క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. కానీ నేటి తరం నాయకులు సొంత పార్టీ క్యాడర్ను నమ్ముకోకుండా ఈ ఎన్నికల మేనిప్యులేటర్లపై ఆధారపడుతున్నారు.
నాయకుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి ఇంట్లో భోజనం చేయాలి, ఏ సామాజిక వర్గంతో ఎలా మాట్లాడాలి అనే మైన్యూట్ ప్లానింగ్ను కూడా ఈ వ్యూహకర్తలే డిసైడ్ చేస్తున్నారు. పంచతంత్రంలో నక్క పాత్రలాంటి ఈ శక్తులు, పార్టీలకు విజయాన్ని అందిస్తామనే భ్రమను కల్పిస్తూ క్రిమినల్ ఆలోచనలతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వెనకాడటం లేదు.ఎన్నికల ఫలితాలు – వ్యూహకర్తల ప్రభావం ఎంత?భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే కేవలం ప్రచారం లేదా వ్యూహాల వల్లే ఏ పార్టీ గెలవలేదనేది స్పష్టమవుతుంది. 1984లో రాజీవ్ గాంధీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ (రెడీ ఫ్యూజన్) ద్వారా భారీ ప్రచారం చేసినా, ఆయన విజయం వెనుక ఇందిరా గాంధీ హత్యానంతర సానుభూతి పవనాలు ఉన్నాయి.
అదే ఏజెన్సీ 1989లో ప్రచారం చేసినప్పుడు బోఫోర్స్ అవినీతి ఆరోపణల వల్ల కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. అలాగే 2004లో అటల్ బిహారీ వాజ్పేయీ ప్రభుత్వం 'ఇండియా షైనింగ్' నినాదంతో అంతర్జాతీయ పబ్లిసిటీ ఏజెన్సీలను నమ్ముకున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. దీన్ని బట్టి ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది కేవలం వ్యూహకర్తలు కాదని, అప్పటి రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత లేదా అనుకూలత మాత్రమేనని స్పష్టమవుతోంది. భవిష్యత్తు రాజకీయాలపై దీని ఇంపాక్ట్రాజకీయాల్లో కార్పొరేట్ శక్తుల జోక్యం భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండే నిజమైన నాయకత్వం కనుమరుగై, కేవలం కోట్ల రూపాయల డబ్బులు కుమ్మరించగల ధనవంతులే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రాధాన్యత తగ్గిపోవడం వల్ల పార్టీల సిద్ధాంతాలు బలహీనపడతాయి. భవిష్యత్తులో కూడా ఈ 'నక్క జిత్తుల' వ్యూహకర్తలను నమ్ముకుంటే తాత్కాలికంగా సోషల్ మీడియా మేనేజ్మెంట్తో భ్రమలు సృష్టించవచ్చేమో కానీ, ప్రజల అసంతృప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ఏ మంత్రదండమూ పనిచేయదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా 'ప్రజల నాడి' (పల్స్ ఆఫ్ ద పీపుల్) ఎరిగిన నాయకుడే నిలబడతాడు తప్ప, ల్యాప్టాప్ వ్యూహాలు శాశ్వత విజయాన్ని అందించలేవు.






