Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...న్యాయవాది కేసులో రాజకీయ నేత అరెస్టు
posted on: May 29, 2026 2:13PM
.webp)
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజకీయ నాయకుడు మహబూబ్ ఆలంఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పోరాడేవాడు. ఈ నేపథ్యం లో పలువురు భూకబ్జాదారులకు ఆయన అడ్డంకిగా మారాడు. ముఖ్యంగా కొన్ని భూముల వ్యవహారాల్లో మహబూబ్ ఆలంఖాన్కు మొయినుద్దీన్ అడ్డుగా నిలిచాడని పోలీసులు గుర్తించారు. కోట్ల రూపాయలు ఇస్తామని, భూ వ్యవహారాల నుంచి తప్పుకోవాలని మొయినుద్దీన్కు ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన తిర స్కరించినట్లు సమాచారం. అంతేకాకుండా కాజా మొయినుద్దీన్ న్యాయం కోసం పోరాటం కొనసాగించడంతో అతడిని ఎలాగైనా సరే హత్య చేయాలని ఆలంఖాన్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య కోసం రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది.
ఈ కుట్ర అమలు కోసం సుపారీ కిల్లర్ కిషన్సింగ్ను రంగంలోకి దింపారు. హత్యను ప్రమాదంలా చూపించేందుకు స్టంట్ మాస్టర్ అభిజిత్ను కూడా ప్లాన్లో భాగం చేశారు. అలాగే వినయ్తో పాటు మరో వ్యక్తి కూడా ఈ కుట్రలో పాలుపం చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఆరుగురు కలిసి మొయినుద్దీన్ హత్యకు పక్కా స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో బయటపడింది. పక్కా పథకం ప్రకారం, ఉదయం మొయినుద్దీన్ కోర్టుకు వెళ్తున్న సమయంలో హిట్ అండ్ రన్ తరహాలో వాహనంతో ఢీకొట్టి హత్య చేసి నట్లు పోలీసులు గుర్తిం చారు. మొదటగా ఇది రోడ్డు ప్రమాదంగా కనిపించినప్ప టికీ, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా తేలింది.
హత్య అనంతరం నిందితులు తెలంగాణ బయట ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. అయితే ప్రత్యేక పోలీసు బృందాలు వేగంగా స్పందించి వారిని గుర్తించి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కిషన్సింగ్తో పాటు పరారీ లో ఉన్న మరో నలుగురిని కూడా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.
ఈ కేసులో రాజకీయ నేత మహబూబ్ ఆలంఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్, సుపారీ కిల్లర్ కిషన్సింగ్, స్టంట్ మాస్టర్ అభిజిత్, వినయ్, మరో సహ నిందితుడు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.. అయితే ఇప్పటికే పోలీసులు హత్యకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలు, సుపారీ చెల్లింపులు, కుట్రలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.






