Latest News
పాక్ కు చుక్క నీరు కూడా ఇవ్వం...
posted on: Nov 25, 2016 3:12PM

సింధూ నది జలాలపై ప్రధాని మోడీ పాకిస్థాన్ కు భారీ షాక్ ఇచ్చారు. ఈరోజు పంజాబ్ పర్యటన చేసిన ఆయన సింధూ నది జలాల గురించి మాట్లాడుతూ.. సింధూ నది జలాలను చుక్క కూడా పాక్కు అనుమతించబోమని, ఆ నీటిని భారత రైతులకు అందించేందుకు తాము ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పారు. పాకిస్థాన్లోకి వెళ్లిపోతున్న నదీ జలాలను ఉపయోగించుకునే హక్కు భారత రైతులకు ఉందని 'సింధూ నదీ జలాలు భారత హక్కు.. కానీ పాక్లోకి వెళ్లిపోతున్నాయి.. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లన్నీ కూడా భారత రైతులవే. ఆ నీళ్లను భారత రైతులకు అందించే చర్యలన్నీ తీసుకుంటాం. పాక్కు చుక్క నీరు పోనివ్వం' అని మోదీ స్పష్టం చేశారు.






