Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెండు వారాలు.. నాలుగు సార్లు.. పెట్రో ధరల పెంపు
posted on: May 25, 2026 8:32AM
.webp)
దేశంలో పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. రెండు వారాల వ్యవధిలో ఈ పెంపు నాలుగో సారి కావడం గమనార్హం. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను సోమవారం (మే 25) మరో సారి పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ థర లీటర్ కు 2.61 రూపాయలు, డీజిల్ ధర లీటర్ కు 2.71 రూపాయలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, డీజిల్ ధర రూ.95.20కు చేరింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి మీదుగా రవాణాకు అంతరాయం కలగడంతో చమురు సరఫ రాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకే చమురు సంస్థలు ధరలను పెంచక తప్పడం లేదని అంటున్నాయి.






