మళ్లీ ఝలక్ ఇచ్చాడుగా... నేను రాను...

posted on: Apr 16, 2018 5:22PM


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వామపక్షాలకు షాకిచ్చారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో గతంలోనే పవన్ వల్ల వామపక్షాలకు షాక్ తగిలింది. బీజేపీతో చేయి కలిపే పవన్ టీడీపీ విషయంలో యూటర్న్ తీసున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత అని పార్టీలకు దూరంగా ఉంటూ ఆఖరికి వామపక్షాలతో కలిశారు. వారితో ఉంటూనే ప్రత్యేక పోరాటం చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు.. దానికి తగిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా చాలు అని అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు విన్న వామపక్షాలు ఖంగుతిన్నాయి. పవన్ ఇలా మాట్లాడేశాండేంటి అని షాక్ తిన్నారు. అనవసరంగా పవన్ తో చేయి కలిపినట్టున్నాం అని కూడా చర్చించుకున్నట్టు సమాచారం. అయితే తాను అలా మాట్లాడలేదని.. తన వ్యాఖ్యాలను వక్రీకరించారని చెప్పుకొచ్చారనుకోండి.

 

ఇక ఇప్పుడు మరోసారి పవన్ వామపక్షాలకు షాకిచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా పవన్, వామపక్షాలతో కలిసి మొన్నీమధ్యే విజయవాడలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందుకు మంచి రెస్పాన్స్ రావడంలో వామపక్షాల నాయకులు కూడా సంబరపడిపోయారు. అయితే ఇలాంటి ఆందోళనలు విజయవాడలో కాకుండా ఢిల్లీలో చేపడితే మంచి ఫలితం ఉంటుందని… పవన్ అందులో పాల్గొంటే జనసేన, వామపక్షాల కూటమికి పొలిటికల్ మైలేజీ వస్తుందని వామపక్షాలకు చెందిన నాయకులు భావించారట. అనుకున్నదే తడవుగా...ఢిల్లీలో ఆందోళనలు చేపట్టాలని వామపక్షాలు ప్లాన్ చేసి..ఢిల్లీ స్థాయిలోని తమ అధిష్టానంతో కూడా వామపక్షాల నాయకులు చర్చలు కూడా జరిపారట. అయితే దీనికి పవన్ నో చెప్పారట. దీంతో పవన్ నిర్ణయంపై వామపక్ష నేతలు షాకయ్యారట. ఈ విషయంలో పవన్ ఎందుకు వెనకాడుతున్నాడో అర్థం కావడం లేదని తలపట్టుకుంటున్నారట. పాపం మరి ఏదో పవన్ తో కలిసి జనంలోకి వెళితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓ నాలుగు సీట్లు వస్తాయని వామపక్ష నేతలు ఆశపడుతున్నారు కానీ పవన్ మాత్రం వారికి షాకులిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు వామపక్షాలు ఏం చేస్తారో చూద్దాం...

google-ad-img
    Related Sigment News
    • Loading...