Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎవరినీ వదిలిపెట్టేది లేదు- అరుణ్జైట్లీ
posted on: Mar 2, 2016 5:40PM

వివాదాస్పద ఎయిర్సెల్-మాక్సిస్ కుంభకోణానికి సంబంధించి మరోసారి పార్లమెంటు అట్టుడికింది. ఈ కుంభకోణంలో ఆనాటి ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడైన కార్తి చిదంబరానికి పాత్ర ఉందనీ, దీని మీద క్షుణ్నంగా దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఎయిర్సెల్, మాక్సిస్... ఈ రెండు సంస్థలూ కూడా తమిళ మూలాలు కలిగిన వ్యక్తులు నెలకొల్పినవే. ఈ రెండు సంస్థలూ కలిసి 2G టెలికాం కుంభకోణానికి పాల్పడ్డాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో కార్తి చిదంబరం చాలా చురుగ్గా వ్యవహరించారన్నది ప్రతిపక్షాల వాదన. దీని మీద లోక్సభలో అరుణజైట్లీ స్పందిస్తూ, ఎయిర్సెల్-మాగ్సిస్ వ్యవహారానికి సంబంధించి తాము సంబంధిత పత్రాలన్నింటినీ వెలికి తీయిస్తున్నామనీ, ఇందులో నిందితులుగా తేలేవారు ఎంత పెద్దవారైనా వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడు తమిళనాట జరగనున్న ఎన్నికలలో, ఈ కుంభకోణం అన్నాడీఎంకేకు గొప్ప వరంగా మారనుంది. ఇదివరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పి.చిదంబరం ఉన్న సమయంలోనే, ఆయన అంగీకారంతోనే ఈ కుంభకోణం సాగిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల ప్రమేయం కూడా ఉన్నట్లు అన్నాడీఎంకే ఆరోపిస్తోంది.



.jpg)


