ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

posted on: Feb 7, 2026 6:01PM

 

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. 

ఏప్రిల్ లో సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో, వెంటనే ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు కసరత్తు ప్రారంభించింది.  2026 జనవరి1ని కటాఫ్‌గా తీసుకుని అసెంబ్లీ  ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఫొటో ఓటర్ కార్డుల జాబితాను సిద్దం చేయలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల పంచాయితీల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...