ఇండియాపై మళ్లీ విషం కక్కిన పాక్ రక్షణ మంత్రి.!

posted on: Jul 29, 2026 12:16PM

పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్ నిప్పుల గుండంగా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై పీవోకే ప్రజలు ఒక రకంగా తిరుగుబాటు ప్రకటింారు.    ప్రాథమిక హక్కుల కోసం,  రాజకీయ ప్రాతినిధ్యం కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. ఒక రకంగా పీవోకేలో పరిస్థితి సివిల్ వార్ ను తలపిస్తోంది.  ఇటువంటి పరిస్థితుల్లో    పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన పాక్ పాలకులు.. పీవోకేను శత్రుదేశంగా అభివర్ణిస్తూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు.  ముఖ్యంగా పాకిస్థాన్ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాక్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పీవోకే నిరసనకారులను ఇండియా లాగే వాళ్లు కూడా పాకిస్థాన్ కు శత్రువులు అంటూ ప్రేలాపనలు చేస్తున్నారు. పీవోకే నిరసనకారులను భారత్ లాగే శత్రువులు అంటూ పాక్ రక్షణ మంత్రి  ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను  పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.  ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను పీవోకే   ప్రధాని ఫైసల్ ముంతాజ్ రాథోడ్   ఖండించారు.  కాశ్మీరీలకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన  ఖవాజా ఆసిఫ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే.. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఇండియా కూడా తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తన సొంత వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని  భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్   ఫైర్ అయ్యారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ చేస్తోన్న ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ,  అణచివేత కారణంగానే  పీఓకే ప్రజల ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

Khawaja Asif POK remarks, POK protests 2026, Pakistan Defence Minister controversy, JAAC Rawalakot march, India slams Pakistan POK, Pakistan occupied Kashmir human rights

google-ad-img
    Related Sigment News
    • Loading...