Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ఆపరేషన్ టేబుల్ పైనే మృత్యుఒడికి!
posted on: Apr 16, 2026 10:22AM
.webp)
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కడుపునొప్పితో బుధవారం (ఏప్రిల్ 15) రాత్రి ఆస్పత్రికి వెళ్లారు. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పిన వైద్యులు, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియోటర్ కు తీసుకువెళ్లారు. అయితే ఆమె ఆపరేషన్ టేబుల్ పైనే కన్ను మూశారు. వివరాలిలా ఉన్నాయి.
హారిక అనే యువతి కడుపునొప్పితో బాధపడుతుండటంతో అమీన్ పూర్ లోని ఓ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఓకే అన్నారు. నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
దీంతో కుటుంబ సభ్యులు సాధారణ కడుపు నొప్పితో ఆస్పత్రికి తీసుకువచ్చామనీ, ఆపరేషన్ అంటూ ప్రాణాలు తీశారనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అదుపు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే హారిక మరణించిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.


.webp)



