కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు

posted on: Feb 8, 2026 11:06AM

 

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతలపై కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు A3గా ఉన్న హీరో మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.  వ్యక్తిగత కారణాలవల్ల తాను ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనని, అటు తర్వాత వస్తానని పోలీసులకు విష్ణు. సమాధానం ఇచ్చారు. ఈ కేసులో వర్సిటీ పీఆర్‌ఓ సతీష్ A-1 సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో A2 గా ఉన్న నటుడు మోహన్ బాబుకు నోటీసులు అందలేదు. 

ఇటీవల మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనల అనంతరం ఎస్ఎఫ్ఐ నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మంచు విష్ణుపై కేసు నమోదు కాగా, విచారణకు హాజరుకావాలంటూ తాజాగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.బాధితుల వాంగ్మూలాలు, ప్రాథమిక ఆధారాల ప్రకారం యూనివర్సిటీ యాజమాన్యం ఆదేశాల మేరకే ఈ కిడ్నాప్ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...