నిషాకి తొందరెక్కువ..!

 

 

 

‘ఏమైంది ఈవేళ ’ అంటూ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిషా ‘సోలో ’, ‘సుకుమారుడు , ‘సరాదాగా అమ్మాయితో ’ లాంటి సినిమాల్లో చేసిన వీటికంటే ఎక్కువ ఎఫైర్లు నడిపిందనే వార్తలతో హైలెట్ అయ్యింది.  తాజాగా ఈ అమ్మడు ముంబై బిజినెస్‌మెన్ ని పెళ్ళి చేసుకోబోతున్నట్లు సమాచారం.

 

 

ముంబై బిజినెస్‌మెన్ కరణ్‌..నిషా అగర్వాల్ చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు..ఈ యేడాది చివర్లో ఇద్దరికీ పెళ్లిచేయాలని ఇరు కుటుంబాలూ నిర్ణయించుకొన్నాయట. ఈలోగా ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకునే విధంగా నిషా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటోందట. అక్క స్టార్ హీరోయిన్ ఆమె ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచనలో కూడా లేదు. అలాంటప్పుడు నేను ఎన్ని రోజులు ఇలా కంట్రోల్ చేసుకోవాలనుకుందో ఏమో గానీ అతనితో పెళ్ళికి సిద్ధమైందట.