తిరుమల శ్రీవారి ఆలయం ముందు కొత్త జంట ఫొటో షూట్.. క్షమాపణలు
posted on: Jan 30, 2026 8:12AM

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక కొత్త జంట జరిపిన ఫోటోషూట్ వివాదాస్పదమైంది. తిరువణ్ణామలైకి చెందిన శ్రీ తిరుమాల్ గాయత్రీ దంపతులు ఇటీవల తిరుమల ఆలయ ప్రాంగణంని కల్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆ దంపతులు శ్రీవారి ఆలయం ముందు ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. శ్రీవారి ఆలయం ముందు ఆ దంపతుల ఫొటో షూట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ జంట.. తమకు టీటీడీ నిబంధనల గురించి తెలియదని.. తెలియక చేసిన తప్పుకు క్షమించాలనీ కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి సేవ చేసేందుకు సిద్ధమని పేర్కొంది. ఇప్పటికే ఆలయం ముందు తాము తీసిన ఫొటోలను పూర్తిగా తొలగించినట్లు ఆ దంపతులు పేర్కొన్నారు.






