త్వరలో కొత్త రూ.20, రూ.50 నోట్లు..

 

పెద్ద నోట్ల తరువాత దేశ వ్యాప్తంగా ప్రజలు చిల్లర కష్టాలు పడుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే వెయ్యి నోటుకు బదులుగా రెండు వేల నోటు వచ్చింది. ఇప్పుడు త్వరలో రూ.20, రూ.50 కొత్త నోట్లను జారీ చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్తగా విడుదల చేయనున్న రూ.20, రూ.50 నోట్లలో చిన్న మార్పులు మాత్రమే ఉంటాయని, డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్ పాత నోట్ల మాదిరిగానే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. కొత్త రూ.20 నోట్ల నంబర్ ప్యానెల్ లో ఇన్ సెట్ లెటర్ గా ‘ఎల్’ ఉంటుందని వెల్లడించింది.