Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాబాగా జీవించిన నేతాజీ?
posted on: Mar 16, 2016 5:32PM

సుభాష్ చంద్రబోస్ జన్మించి ఈ ఏడాదికి 120 ఏళ్లు కావస్తున్నాయి. కానీ ఆయన మరణం గురించి మాత్రం ఇంకా రోజులో వార్త వినిపిస్తూనే ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి, సైనిక పోరాటం ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని ఆశించిన ఈ నేతాజీ ఆగస్టు 18, 1945 నుంచి కనిపించకుండా పోయారు. ఆ రోజు జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ, జపాన్లో మరణించారని అందరూ అంటారు. కానీ ఆయన ఆ విమాన ప్రమాదంలో మరణించలేదనీ, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనీ చెబుతారు. ఇంతకీ బోస్ మరణించకపోతే మరి ఎక్కడ జీవించినట్లు అని రకరకాల ఊహలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఊహలో ఒకటి... ఆయన ఉత్తర్ప్రదేశ్లోని ఫైజాబాద్ అనే ప్రాంతంలో సన్యాసిగా నివసించారన్న అనుమానం. స్థానికులు భగవాన్జీ లేదా గుమ్నామ్ బాబాగా కూడా పిల్చుకునే ఈ అపరిచిత సన్యాసి 1985 వరకూ సజీవంగానే ఉన్నారు. తాను నేతాజీని అని ఆయన ఎప్పుడూ చెప్పుకొనప్పటికీ పోలికల్లోనూ, మాట తీరులోనూ ఈ సన్యాసి అచ్చు నేతాజీలాగానే ఉండేవారట. ఈ విషయం అప్పట్లోనే ప్రభుత్వ దృష్టికి వచ్చినప్పటికీ, అందులోని నిజానిజాలను శోధించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. చేసిన కొద్దిపాటి ప్రయత్నాలూ అయనే నేతాజీ అని రుజువూ చేయలేదు. దాంతో ఈ అపరిచిత సన్యాసి గురించి అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు బయటపడిన కొన్ని సాక్ష్యలు ఆ బాబానే అజ్ఞాతంలో ఉన్న నేతాజీ అని బలపరుస్తున్నాయి. నిన్న ఫైజాబాద్లోని ట్రెజరీ కార్యాలయంలో ఉన్నా ఈ బాబాగారి పెట్టెలను తెరిచి చూసిన వారికి, అందులో నేతాజీకి చెందిన అపురూపమైన ఫొటోలు, ఉత్తరాలు కనిపించాయి. దీంతో విమాన ప్రమాదంలో చనిపోయాడనుకున్న నేతాజీ దాదాపు మరో 40 ఏళ్లు మన మధ్యే జీవించి ఉంటాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.






