మాజీ ఐపీఎస్ అధికారి భార్యను చంపింది నేపాల్ గ్యాంగే.. సీపీ

posted on: May 8, 2026 2:48PM

మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా రంజన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు  తేలిందని చెప్పారు. కొన్ని ముఖ్య మైన క్లూస్ లభించాయనీ..  వాటి ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన గురువారం (మే 7) అర్ధరాత్రి సమయంలో జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజాన్ రాయ్  ఇంట్లో లేని సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి తనూజాను దారుణంగా హత్య చేశారు. ఆమెను చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపి రాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

దుండగులు ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయని భావించి వెనుక గేటు ద్వారా ఇంట్లోకి ప్రవేశించి..  హత్య అనంతరం అదే మార్గం ద్వారా పరార య్యారు. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నామని, నింది తులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, వారు సంవత్స రాలుగా పనిచేసినా అప్రమ త్తంగా ఉండాలని సూచించా రు. 

ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటీవల మాజీ డీజీపీ కుటుంబంలో మరణం సంభవించడంతో తనూజ హైదరాబాద్‌లోనే ఉండటం ప్రారంభించారని తెలిపారు. ఈ ఘటనలో ఎంత బంగారం, నగదు అపహరించబడిందన్న అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...