హలో చంద్రబాబూ.. ఏంటీ సంగతి?
posted on: May 7, 2014 11:24AM
.jpg)
సీమాంధ్రలో పోలింగ్ చకచకా జరుగుతోంది. చంద్రబాబుకి పట్టం కట్టడానికి సీమాంధ్ర ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బుధవారం పదకొండు గంటల సమయానికి సీమాంధ్ర వ్యాప్తంగా 20 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే పోలింగ్ ముగిసే సమయానికి భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యే అవకాశం వుంది. ఇది తెలుగుదేశం పార్టీకి శుభ సూచకంగా భావించవచ్చు. సీమాంధ్ర పోలింగ్ మీద జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొని వుంది. సీమాంధ్రలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే చంద్రబాబు నాయుడికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నుంచి ఫోన్ వచ్చింది. సీమాంధ్రలో జరుగుతున్న పోలింగ్ సరళికి సంబంధించిన వివరాలను నరేంద్రమోడీ చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు. సీమాంధ్రలో పోలింగ్ టీడీపీ, బీజేపీ కూటమికి అనుకూలంగా జరుగుతోందని చంద్రబాబు నరేంద్రమోడీకి చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్ర బీజేపీకి చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ బీజేపీ, టీడీపికి ఎక్కువ ఎంపీ స్థానాలు అవకాశం వుంది. ఇవి కేంద్రంలో నరేంద్రమోడీకి బలాన్నిచ్చే అవకాశం వుంది. అందుకే నరేంద్రమోడీ సీమాంధ్ర పోలింగ్ మీద ఆసక్తిగా వున్నారు.




.jpg)
.webp)

.webp)


