ప్రధాని మోదీని కలిసిన భారత్ మహిళా క్రికెట్ జట్టు
posted on Nov 5, 2025 8:38PM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఉమెన్ క్రికెట్ జట్టు సభ్యులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా టీమ్ఇండియా జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు జట్టు సభ్యులు దిల్లీలోని ఈ సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రపంచ కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా 'నమో' అని సంతకం చేసిన టీమిండియా జెర్సీని ప్రధానికి మహిళా జట్టు బహూకరించింది. 2017 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. నాడు రన్నరప్తో సరిపెట్టుకుంది. అప్పుడు మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు ప్రధానిని కలిసింది. ఈ విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీకి ప్రపంచ కప్ను జట్టు సభ్యులు అందించారు.