Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫేస్ రికగ్నిషన్ హాజరుపై పకడ్బందీ చర్యలు : మంత్రి లోకేష్
posted on: Apr 16, 2026 9:17PM
.webp)
రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో మరింత పారదర్శకత కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేయనున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యా సంస్థల వివరాలతో పాటు సిబ్బంది, విద్యార్థుల ముఖ ఆధారిత గుర్తింపు కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. నాణ్యమైన విద్యా బోధనకు ముఖ ఆధారిత హాజరు ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.



.webp)


