నమో అంటే నాయుడు.. మోడీ కాంబినేషన్.. నారా లోకేష్

posted on: Feb 28, 2026 9:12AM

పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో  అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన, అనుభవజ్జుడైన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు కారణమని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు దార్శనికత, ఆయనపై ఉన్న విశ్వసనీయత కారణంగానే   పారిశ్రామిక వేత్తలు ఏపీవైపు చూస్తున్నారని నారా లోకేష్ చెప్పారు.  ఎబిపి నెట్ వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026 పేరిట నిర్వహించిన సదస్సులో మాట్లాడిన లోకేష్ కేవలం 17నెలల్లో దేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అన్ని అనుమతులు ఇచ్చామనీ,  మార్చి 3వవారంలో ఆ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయబోతున్నామనీ చెప్పారు.  

 డిల్లీలో ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు  కాంబినేషన్ ను లోకేష్  నమో (నాయుడు-మోడీ)గా అభివర్ణించారు.   మొత్తం భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3శాతం ఎపికి రావడానికి నమో నాయకత్వమే ప్రధాన కారణమన్నారు.  కాంపిటీటివ్ అడ్వంటేజ్ లో భాగంగా మేం ఎకరా 99పైసలకే ప్రధాన కంపెనీలకు భూములిస్తున్నామన్న లోకేష్..  ఫార్చూన్ 500 కంపెనీలను రప్పించేందుకు  ప్రత్యేక పాలసీ రూపొందించామన్నారు.  

 ఇచ్చే భూమి కంటే ఆ కంపెనీలు సృష్టించే ఎకోసిస్టమ్ చాలా రెట్లు పెద్దదని వివరించారు. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఉదాహరణగా ఆయన..   కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ తో దావోస్ లో కలిసి మాట్లాడాననీ, తాను   రెండోసారి దావోస్ వెళ్లేటప్పటికీ విశాఖలో ఆ కంపెనీ భూమిపూజ చేసిందనీ,  వచ్చే ఏడాది మూడోసారి దావోస్ కు వెళ్లే సమయానికి భవనాలు కూడా పూర్తవుతాయనీ చెప్పారు. దీని ద్వారా విశాఖపట్నంలో   యువతకు సుమారు 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ కంపెనీ రాకతో ప్రతిఏటా 1500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి. భూమి విలువకంటే ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి లభించే ప్రయోజనం ఖచ్చితంగా పెద్దదని క్లారిటీ ఇచ్చారు.    

google-ad-img
    Related Sigment News
    • Loading...