శంకర మఠంలో శ్రీ విధుశేఖర భారతీస్వామిని కలిసిన సీఎం రేవంత్

 

హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా  శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి హైదరాబాద్ విచ్చేశారు. 

ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీస్వామివారికి ముఖ్యమంత్రి వివరించారు. సీఎం.. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విధుశేఖర భారతీస్వామిని కలిసి.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu