తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

posted on: Feb 9, 2026 4:48PM

 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న నేతలు.. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. 

 ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంది. 52 లక్షల మంది ఓటర్ల 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...