నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు

posted on: Feb 3, 2026 5:42PM

 

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్లు ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ రాత్రి లేదా లేదా ఉదయానికి పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎన్నికల చిహ్నాలు పొందిన వెంటే ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 

బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సివస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి
 

google-ad-img
    Related Sigment News
    • Loading...