ఛార్మీ దెబ్బకి ముద్రగడ ఔట్...
posted on: Jul 26, 2017 5:20PM
.jpg)
హీరోయిన్ ఛార్మి దెబ్బకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఔటయ్యాడు. ఛార్మికి, ముద్రగడకి సంబంధం ఏంటబ్బా అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. ముద్రగడ పద్మనాభం ఈరోజు చలో అమరావతి పాదయాత్రను ప్రారంభించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు పోలీసుల అనుమతి ఇవ్వలేదు. అయినా కానీ ముద్రగడ పాదయాత్ర చేపట్టాలని అనుకున్నారు.. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని ఇంటి గేటు వద్దే అడ్డుకొని 24 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలను కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈరోజు చార్మీ సిట్ విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది మీడియా ఫోకస్ మొత్తం చార్మీ పైనే పడింది. ఉదయం ఛార్మీ సిట్ విచారణకు వచ్చింది మొదలు.. ఛార్మీ పై సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు.. ఏ ప్రశ్నలు అడిగారు అంటూ ఇలా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ.. అన్ని ఛానల్స్ చార్మీపైనే ఫోకస్ పెట్టి వార్తలు అందించాయి. దీంతో ముద్రగడ తాను అనుకున్నది.. జరిగింది ఒకటైంది. గతంలో ఆయన ఉద్యమం అంటే మీడియా కనీసం కొంత సేపైనా కవరేజ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎదో ఒక విధంగా షో చేసి మీడియా ఫోకస్ ని తన మీదకు తిప్పుకోని రాష్ట్ర ప్రజల ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న ముద్రగడ ప్లాన్ బెడిసికొట్టింది. చార్మీ హడావుడిలో మీడియా ముద్రగడను పట్టించుకోలేదు. మొత్తానికి పాదయాత్ర నేపథ్యంలో మీడియాను తనవైపు తిప్పుకోవాలన్న ప్లాన్ ను ఛార్మీ వల్ల తుస్సుమంది.







.webp)


