Latest News
డ్రగ్స్ టెస్ట్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు పాజిటివ్
posted on: Mar 15, 2026 11:13AM

డ్రగ్స్ టెస్ట్లో ఎంపీ పుట్ట మహేశ్కుమార్ పాజిటివ్ వచ్చింది . రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాత్రి నుండి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రెస్ పార్టీలో నువ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో దొరికిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు అయితే అందులో ఐదుగురికి మాత్రం పాజిటివ్ రాగా మరికొందరికి నెగటివ్ వచ్చింది.
దీంతో పోలీసులు మరోసారి 11మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ను పరీక్షించగా మహేష్ కుమార్కు డ్రగ్స్ పాజిటివ్గా తేలినట్లు వెల్లడించారు. అయితే మహేష్ కు మొదట నిర్వహించిన యూరిన్ టెస్ట్లో మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి బ్లడ్ టెస్ట్ నిర్వహించారు.ఈవిచారణలో భాగంగా యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడం వల్లే యూరిన్ టెస్ట్లో డ్రగ్స్ నెగిటివ్గా వచ్చినట్లు తేల్చారు.
బ్లడ్ టెస్ట్లో మాత్రం మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. వీకెండ్ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మొయినా బాద్లోని తన ఫామ్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.






