Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇన్స్టాగ్రామ్లో తోపులెవరో తెలుసా?
posted on: Jun 17, 2026 9:11AM

అంతర్జాతీయ దౌత్య వేదికలపై దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, ఒప్పందాలు జరగడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అక్కడ చోటుచేసుకునే సరదా సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక సరదా సన్నివేశం ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సులో ఆవిష్కృతమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంభాషణ మళ్లీ మెలోడీ ట్రెండ్ ను తెరపైకి తెచ్చింది.
ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారమ్లో మనమే ఫేమస్ అంటూ ఇటలీ పీఎం మెలోనీ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. జీ 7 సదస్సులో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలంతా సంప్రదాయబద్ధంగా ఒకేచోట చేరి ఫ్యామిలీ ఫోటో' దిగడానికి సిద్ధమైన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని పలకరించిన జార్జియా మెలోనీ.. మిమ్మల్ని ఇక్కడ మళ్లీ కలుసుకోవడం సంతోషందా ఉందన్నారు. దానికి ప్రధాని మోదీ డిజిటల్ ప్రపంచంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ ఇద్దరికీ ఉన్న పాప్యులారిటీని గుర్తు చేశారు. మోదీ సమాధానానికి ఇటలీ ప్రధాని మెలోనీ హాయిగా నవ్వుతూ.. నిజమే.. ఇన్స్టాగ్రామ్లో మనమే ఫేమస్ మన తరువాతే ఎవరైనా అంటూ బదులిచ్చారు.
అలా ఈ ఇద్దరి మధ్యా జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిముషాల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. నిజానికి ప్రధాని మోదీ, జార్జియా మెలోనీల మధ్య ఇలాంటి సరదా ముచ్చట్లు సాగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇటలీ రాజధాని రోమ్ నగరంలో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ ఇటలీ పీఎం మెలోనీకి మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అప్పట్లో మెలోనీ, హలో ఫ్రం ది మెలోడి టీమ్ అనే క్యాప్షన్ను జోడించి మోడీ తనకు మెలోడీ చాక్లెట్లను బహుమతిగా అందజేస్తున్న ఫొటోను పోస్టు చేశారు. అప్పటి నుంచి నెటిజన్లు నరేంద్ర మోదీ పేరులోని చివరి అక్షరాలను, జార్జియా మెలోనీ పేరును కలిపి మెలోడి హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ చేశారు.






