Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘లవ్ జిహాద్’ ఆరోపణలకు చెక్ పెట్టిన మోనాలిసా.. బెదిరింపులపై స్పందించిన భర్త!
posted on: Mar 21, 2026 5:38PM
మహా కుంభమేళా 2025లో తన నీలి రంగు కళ్లతో, రుద్రాక్ష మాలలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన 'రుద్రాక్ష గర్ల్' మోనాలిసా భోస్లే ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె పెళ్లాడటంతో ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కేరళలోని తిరువనంతపురంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి కేరళ మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరి వివాహాన్ని 'లవ్ జిహాద్' అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో పాటు, వీరికి బెదిరింపులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై భర్త ఫర్మాన్ ఖాన్ మీడియా ముందు గట్టిగానే స్పందించారు.
తాము ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నామని, ఇందులో ఎటువంటి బలవంతం లేదని ఫర్మాన్ స్పష్టం చేశారు. "మేము ముందుగా మనుషులం. ఎవరి మతాన్ని వారు పాటిస్తూనే ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఆమె హిందూగానే ఉంటుంది, నేను ముస్లింగానే ఉంటాను. ఇక్కడ మత మార్పిడి ప్రసక్తే లేదు" అని ఆయన కుండబద్ధలు కొట్టారు. మోనాలిసా కూడా తన తండ్రికి ఇష్టం లేకపోయినా, తన ఇష్ట ప్రకారమే ఈ వివాహం చేసుకున్నానని మీడియాకు వివరించారు.
వీరిద్దరూ 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆరు నెలల ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి పీటలెక్కారు. ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్కు చెందిన నటుడు కాగా, మోనాలిసా మధ్యప్రదేశ్ వాసి. వీరిద్దరి కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఈ సినిమా సెట్స్పై ఉంది. ఈ సినిమాలోని వీరి కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది.
ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ యాప్ ద్వారా వీరు తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు. కేరళ ప్రజలు తమకు ఎంతో మద్దతుగా ఉన్నారని, అవసరమైతే అక్కడే సెటిల్ అవుతామని కూడా ఈ జంట ప్రకటించడం విశేషం.






