Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మొయినాబాద్ ఫామ్ కేసులో వాదనలు ముగింపు...తీర్పు రేపటికి వాయిదా!
posted on: Apr 6, 2026 6:17PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ మరియు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని వారి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. నిందితులు ఇప్పటికే సుమారు 20 రోజులుగా జైలులో ఉన్నారని, పోలీసులు ఇచ్చిన రెండు విడతల కస్టడీలో మొత్తం ఆరు రోజుల పాటు విచారణకు పూర్తిగా సహకరించారని వారు వాదించారు. ఇకపై కస్టడీ అవసరం లేదని, బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్కు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు వివరించారు. నిందితుల నుంచి ఇంకా అనేక కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. విచారణకు నిందితులు పూర్తిగా సహకరించలేదని కూడా పేర్కొన్నారు.అదనంగా, రితీష్ మరియు రోహిత్ రెడ్డి బ్యాంక్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.


.webp)



