Latest News

టీమ్ ఇండియాకు ప్రధాని మోడీ అభినందనలు

posted on: Mar 8, 2026 11:31PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పైనల్ లో విజయం సాధించి చాంపియన్ గా నిలిచిన టీమ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.  టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

  జట్టు   నైపుణ్యాలు, దృఢ సంకల్పం, టీమ్ వర్క్‌కు ఈ విజయం నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.  టోర్నమెంట్ ఆద్యంతం టీమ్ ఇండియా  ఆటగాళ్లు చూపిన పోరాట పటిమ అద్బుతమన్నారు. ఈ విజయం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో, ఆనందంతో నింపిందపేర్కొంటూ.. వెల్ డన్ టీమ్ ఇండియా అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...