ట్విట్టర్ ఖాతాలు తెరిచినంతమాత్రాన నమ్ముతారా...?


సోషల్ మీడియాని వాడుకోవడంలో ప్రధాని మోడీ దిట్ట అని అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీకి ఇంత ఫాలోయింగ్ వచ్చి అధికారం చేపట్టిందంటే ఓ రకంగా ఈ సోషల్ మీడియా కూడా కారణం అని చెప్పొచ్చు. అన్ని పార్టీలేమో కానీ.. బీజేపీ, మోడీ మాత్రం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడుకున్నారు. ఎక్కడ చూసినా జనాలు నమో.. నమో అనుకునేలా చేశారు. ఇక ఈసారి కూడా మోడీ సోషల్ మీడియానే వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే బీజేపీ ఎంపీలందరికీ ఓ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగిన నేపథ్యంలో మోడీ బీజేపీ ఎంపీలంతా ట్విట్టర్ లో అధికారిక ఖాతాలు తెరవాలని ఆదేశించారు. అంతేనా.. ఒక్కో ఎంపీకి కనీసం మూడు లక్షల మంది ఫాలోయర్లు ఉండాలని టార్గెట్ విధించారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శలను ఎండగట్టేందుకు ఎంపీలంతా ప్రజల్లోకి వెళ్లాలని... వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాల అసత్యాలను తిప్పికొట్టేలా మన సందేశం ప్రజల్లోకి వెళ్లాలని సూచించారట. దాదాపు మూడు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. ఇందులో సోషల్ మీడియాను వినియోగించుకోవడంపైనే ఎక్కువ చర్చ జరిగిందట. మరి అప్పుడంటే మోడీకి క్రేజ్ ఉంది కాబట్టి అందరూ నమ్మేశారు. కానీ ఈ నాలుగేళ్లలో బీజేపీ వైఖరి, పాలన చూసిన చాలా మంది..మోడీకి వ్యతిరేకంగా తయారయ్యారు. అలాంటిది ఇప్పుడు ఎన్ని ట్విట్టర్ ఖాతాలు తెరిచినా... ఎంత మంది ఫాలోవర్లు ఉన్నా వేస్ట్ అన్న విషయం మోడీకి తెలియట్లేదు. దానికితోడు ఇటీవలే ఓ నిజం కూడా బయటపడింది. మోడీకి సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లలో 60 శాతం ఫేక్ అకౌంట్లనే తేలింది. ఇంత తెలిసిన తరువాత ఏదో తమ నేతలతో ఖాతాలు తెరిపించినంత మాత్రనా నమ్మడానికి సిద్దంగా లేరన్న విషయం గుర్తుపెట్టుకుంటే బెటర్.  కేవలం ట్విట్టర్ ఖాతాలు తెరిచి రాజకీయాలు చేద్దామనుకుంటే అది కాని పని అని తెలుసుకుంటే మంచిది...