Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాటలతో మోడీని టార్చర్ పెడుతున్న మంత్రులు
posted on: Oct 24, 2015 6:41PM

మాటలతో మోడీని టార్చర్ పెడుతున్న మంత్రులు
ప్రధాని నరేంద్రమోడీకి కేంద్ర మంత్రులు చిక్కులు తెచ్చిపడుతున్నారు, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మంత్రులు ఇరకాటంలో పెడుతుంటే... తాజాగా వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది... మోడీ తలబొప్పి కట్టిస్తున్న మంత్రుల మాటలేంటో మీరూ చదవండి
(కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్)
- ఎవరో కుక్కపై దాడి చేస్తే కేంద్రాన్ని నిందిస్తారా? ... ఫరిదాబాద్లో ఓ దళిత కుటుంబంపై అగ్రవర్ణాల దాడి, ఇద్దరు చిన్నారుల సజీవదహనంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ కామెంట్
(కేంద్ర సహాయ మంత్రి మహేశ్ శర్మ)
- ముస్లింలందరూ దేశ భక్తులు కాదు, మహాభారతం, రామాయణం లాగా బైబిల్, ఖురాన్ గ్రంథాలు భారత ఆత్మ కాదు
(కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి)
- భారతదేశంలో ఉండాలనుకుంటున్న వారంతా తాము శ్రీరాముని బిడ్డలమని అంగీకరించాలి
(కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్)
- పాకిస్తాన్ కు మద్ధతిచ్చేవారే మోడీని వ్యతిరేకిస్తున్నారు, మోడీని వ్యతిరేకించే నేతలంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలి
(బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ)
- కులతత్వం బీహార్ డీఎన్ఏ లోనే ఉంది






