Latest News

దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్

posted on: Mar 21, 2026 8:53PM

 

 

హైదరాబాద్‌లో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే మరో కీలక వివాదం తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ వ్యవహారంపై హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 11న స్పీకర్ ఇచ్చిన తీర్పులో దానం నాగేందర్ పార్టీ మారలేదని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు (క్వాష్) చేయాలని పిటిషన్‌లో కోరారు. 

గత ఏడాది ఏప్రిల్ 23న జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో దానం కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ తేదీ నుంచే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి వాదిస్తు న్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేగా దానం ఇప్పటివరకు పొందిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయాలని కూడా తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరపనున్నది. తెలంగాణ హైకోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...