సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ

posted on: Feb 16, 2026 8:11PM

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ది జరుగుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. వీటికి  సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రికి ఆయన తెలియచేశారు. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల ద్వారా ఈ సమస్యల పరిష్కారం జరుగుతుందని తుమ్మల తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...