Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలిగా మెగా స్టార్ సతీమణి!
posted on: Jul 1, 2026 9:08AM
.webp)
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. యాదగిరి గుట్ట అభివృద్ధి, పాలనను మరింత పటిష్టం చేసే దిశగా నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. ప్రపంచప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం ) బోర్డు తరహాలోనే, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కమిటీని రూపొందించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 18 మంది సభ్యులతో ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది.
నూతన పాలక మండలి బోర్డు ఛైర్మన్గా ప్రముఖ ఔషధ రంగ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండీ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి రెండు పీహెచ్డీలు అందుకున్న విద్యాధికుడు, వ్యాపారవేత్త మన్నె సత్యనారాయణ రెడ్డి గతంలో మహబూబ్నగర్ ఎంపీగా పనిచేసిన మన్నె శ్రీనివాస్రెడ్డికి స్వయానా సోదరుడు కావడం గమనార్హం.
ఇక ఈ బోర్డులో మెగాస్టార్, ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు ప్రభుత్వం చోటు కల్పించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సురేఖ నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సురేఖతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు లింగయ్య, స్వాతి కాంతమణి, ఎం.రాఘవేంద్ర రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ , ఆలయ ఫౌండర్ ట్రస్టీలు సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ 18 మందితో కూడిన కమిటీలో కేవలం ప్రజాప్రతినిధులు, ప్రముఖులే కాకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఎక్స్-అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ ఛైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఈ బోర్డులో ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు. అధికారిక హోదాలో ఉండే ఎక్స్ అఫీషియో సభ్యులు, ఆలయ ఫౌండర్ ట్రస్టీలు మినహా, నూతనంగా నియమితులైన మిగిలిన బోర్డు సభ్యుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఈ పాలకమండలి యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడం, ఆలయ సంపదను రక్షించడం మరియు దివ్య క్షేత్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి నిరంతరం కృషి చేయనుంది.






