Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెగా డీఎస్సీ 2026 నోటీఫికేషన్ ఎప్పుడంటే?
posted on: Jun 12, 2026 10:46AM

ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ అభ్యర్థులకు, నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ 2026 నోటిఫికేషన్పై అధికారిక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా.. ఈ ఏడాది అక్టోబర్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, నియామక రాత పరీక్షలను కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అమరావతిలోని సచివాలయంలో జరిగిన గురువారం (జూన్ 11) ఏర్పాటు చేసిన మీడియా సమావేంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ వివరాలను వెల్లడించారు.
అలాగే.. డీఎస్సీ 2025 నియామకాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న పలు ఆరోపణలపై స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియా వేదికగా హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా నియామకాలు, అలాగే దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుపై కొంతమంది చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అంతా కూడా నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శకంగా జరిగిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విస్పష్టంగా చెప్పారు.
ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అంతా పూర్తి డిజిటల్ రూపంలోనే సాగిందని, అందువల్ల పేపర్ లీకేజీలకు , అవకతవకలకు ఇసుమంతైనా ఆస్కారం లేదన్నారు. అలాగే.. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై క్రీడాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ జీవో ప్రకారం.. నేషనల్ గేమ్స్, నేషనల్ ఛాంపియన్షిప్స్, ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ పోటీలు, సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ ఈవెంట్స్, స్టేట్ ఛాంపియన్షిప్స్, అంతర్జాతీయ పోటీలలో సాధించిన సాధికారిక విజయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఈ క్రమంలో 34 రకాల విభిన్న క్రీడా విభాగాల నుండి మొత్తం 382 మంది అభ్యర్థులను స్పోర్ట్స్ కోటా కింద క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సింగిల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ను అర్హత నిర్ధారించడానికి ముందు మల్టీ-లెవెల్ వెరిఫికేషన్ చేశామరి అజయ్ జైన్ వివరించారు. రాష్ట్ర యువతలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూనే, నియామకాల్లో నిష్పాక్షికతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.


%20(2).webp)
%20(1).webp)


