పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

posted on: Jun 23, 2026 12:54PM

 అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం (జూన్ 23)  భారీ అగ్నిప్రమా దం సంభవించింది. దక్షిణ్ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిశ్రమ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో  బయటకు పరుగులు తీశారు.

అయితే కొందరు బయటకు వచ్చే దారిలేక లోపలే చిక్కుకున్నారు.  ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మరి కొందరు  కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకున్నారని అంటున్నారు. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయ టకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీ పంలోని ఆస్పత్రులకు తర లించి చికిత్స అందిస్తు న్నారు.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి  తెచ్చారు.  కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు భారీగా ఎగసి పడ్డాయి.  ప్రమాదానికి గల కారణాలు  తెలియాల్సి ఉంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...