మలేషియా విమాన దుర్ఘటనలో 100మంది ఎయిడ్స్ శాస్త్రవేత్తల దుర్మరణం

posted on: Jul 18, 2014 9:12PM

 

వేటగాడి బాణం దెబ్బకు విలవిలలాడుతూ నేలకొరిగిన శాంతి కపోతంలా, 280మంది ప్రయాణికులతో వెళుతున్నమలేషియా విమానం ఉగ్రవాదుల దాడిలో నిన్న రష్యా సరిహద్దుల వద్ద నేలకొరిగింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని అణచివేసేందుకు కృషి చేస్తున్న దాదాపు వందమంది రీసర్చ్ శాస్త్రవేత్తలు, వారికి నాయకత్వం వహిస్తున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిడ్స్ పరిశోధకుడు మరియు అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీకి మాజీ అధ్యక్షుడు అయిన జోయీప్ లాంజ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వారందరూ ఆస్ట్రేలియాలో జరగబోయే అంతర్జాతీయ ఎయిడ్స్-2014 సమావేశానికి వెళుతున్నారు. వారు గనుక మరణించి ఉండకపోతే బహుశః ఎయిడ్స్ నివారణకు వారు ఏదయినా పరిష్కారం చూపేవారేమో? కానీ దురదృష్టం కొద్దీ ఎయిడ్స్ మహమ్మారి గురించి చాలా లోతయిన అధ్యయనం చేసిన వందమంది శాస్త్రవేత్తలను ఒకేసారి ఏ కోల్పోయాము. ఇది యావత్ ప్రపంచానికి తీరని నష్టంగా చెప్పుకోవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...