Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
posted on: Apr 20, 2026 5:00PM
.webp)
రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో పచ్పద్ర రిఫైనరీలో సోమవారం (20-04-2026) అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఈ రిఫైనరీని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమాదం కారణంగా గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ వ్యాపించింది.సమాచారం అందుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ పచ్పద్ర రిఫైనరీకి 2013 సెప్టెంబర్ 22న కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. అప్పట్లో అశోక్ గెహ్లోట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రూ. 37,230 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ను, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 జనవరి 16న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ప్రారంభించారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) మరియు రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నాయి. దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.






