మైపాడు బీచ్‌లో విషాదం...ముగ్గురు మృతి

posted on: Nov 2, 2025 3:40PM

 

నెల్లూరు మైపాడు బీచ్‌లో విషాదం నెలకొంది. ఇందూకురుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతులు నారాయణరెడ్డి పేటకు చెందిన వారిగా గుర్తించారు. హాలిడే కావడంతో ముగ్గురు స్నేహితులు బీచ్‌కి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఘటన స్థలికి చేరుకున్న మైరెన్ పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న మెరైన్ పోలీసులు.. సముద్రంలో గాలించి మృతదేహాలని వెలికి తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...